Election Code Break: తెలంగాణలో నేడు బిగ్ డే. ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ జరుగుతోంది. బీఆర్ఎస్ నాయకులు అడుగడుగునా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నారు. ఉదయాన్నే పార్టీ కండువాతో పోలింగ్ బూత్లోకి వెళ్లారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఇది కోడ్ ఉల్లంఘన అనే విషయం ఒక సీనియర్ శానససభ్యుడైన ఇంద్రకరణ్ రెడ్డికి తెలీదా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
ఇంకో దారుణ ఉల్లంఘన ఏమిటంటే.. తమ పార్టీకి ఓటెయ్యాలంటూ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు చేయడం. జూబ్లీహిల్స్లో ఓటేసిన ఆమె ఎన్నికల నియమాళికి విరుద్ధంగా మాట్లాడారు. ఇది పోలింగ్ బూత్లో ప్రచారం చేయడమే అంటూ విపక్షాలు అభ్యంతరం చెప్తున్నాయి. ఇదే విషయంపై కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకోవాలని కోరారు. అటు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్.. కవితపై సీరియస్ అయ్యారు. బాధ్యతాయుతమైన వ్యక్తులు మాట్లాడే విధానం ఇదేనా అంటూ ప్రశ్నించారు.
అటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. ఇటు ఎమ్మెల్సీ కవితే కాదు.. మేము మాత్రం ఏమి తక్కువ అన్నట్టు బీఆర్ఎస్ కేడర్ ప్రవర్తిస్తోంది. ఆసిఫాబాద్లో అభ్యర్థి ఫోటో అంటించిన వెహికల్పై ఓటు వేసేందుకు ఓ బీఆర్ఎస్ నాయకుడు వెళ్లారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని వాగ్వాదానికి దిగారు.