BRS: వికారాబాద్ జిల్లా ఓల్డ్ తాండూర్ లోని అంబేద్కర్ పార్క్ దగ్గర జాతీయ పతాకం ఎగరవేసే విషయంలో వివాదం చెలరేగింది. అధికార పార్టీ బీఆర్ఎస్ లోని ఇద్దరు నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
జెండా పండుగకు హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మధ్య వివాదం నెలకొంది. జెండా తానే ఎగుర వేస్తానంటూ స్వప్న భీష్మించారు. దీంతో గొడవ ప్రారంభమైంది.
ఎమ్మెల్యే సమక్షంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్గానికి చెందిన చైర్ పర్సన్ స్వప్న , ఎమ్మెల్యే వర్గానికి చెందిన వైస్ చైర్ పర్సన్ దీప భర్త నర్సింహులుకు మధ్య మాటల యుద్ధం జరిగింది.
చివరకు కాస్త తగ్గిన స్వప్న.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికే జెండా ఎగురవేసే అవకాశం ఇచ్చారు.