BRS leaders Protested in Assembly(Latest political news Telangana): తెలంగాణ శాసనసభలో అధికార కాంగ్రెస్కు, ప్రతిపక్ష బీఆర్ఎస్కు వాగ్వాదం చోటు చేసుకుంది. అసెంబ్లీలో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు బయటకు వచ్చారు. కేసీఆర్ నల్గొం సభలో చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బాష పైన బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సభ నుంచి వాకౌట్ చేశారు.
అనంతరం మీడియా పాయింట్ వద్దకు వెళ్తుండగా పోలీసులు, మార్షల్స్ వారిని అడ్డుకోవడంతో భారాస ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేసి.. వారితో వాగ్వాదానికి దిగారు. సభ జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్ వద్దకు అనుమతులు ఉండవని పోలీసులు చెప్పగా.. ఆ ఉత్తర్వులు చూపాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.
Read More: నేడు కోదండరామ్ ఎమ్మెల్సీ ఎన్నికపై హైకోర్టులో విచారణ.. తీర్పుపై ఉత్కంఠ..
సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా పాయింట్ వద్ద వెళ్లే అవకాశం లేదా? అని వారు ప్రశ్నించారు. బారికేడ్లు అడ్డుగా పెట్టడంతో అక్కడే బైఠాయించి నిరసన కొనసాగించారు. కేటీఆర్, హరీశ్రావు, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్రెడ్డి, కడియం శ్రీహరి తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు.
అసెంబ్లీ ప్రాంగణంలో ఎమ్మెల్యేల గొంతు నొక్కి.. ఎమ్మెల్యేలపై ఆంక్షలు ఎందుకని హరీశ్రావు ప్రశ్నించారు. ఇక్కడ ఎందుకు 3-4వేల మంది పోలీసులను మోహరించారని ఆరోపించారు. మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు అనుమతి ఇస్తారా లేద కంచెలు బద్దలు కొట్టాలా? అని పాడి కౌశిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.