ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్లో అసమ్మతి మొదలైంది. దివంగత నేత, మాజీ మంత్రి అజ్మీర చందూలాల్ కుమారుడు, ములుగు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ ప్రహ్లాద్ పార్టీపై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడిస్తానంటున్నారు.
ములుగు బీఆర్ఎస్ అభ్యర్థిగా బడే నాగజ్యోతి పేరును ప్రకటించారు గులాబీ చీఫ్ కేసీఆర్. అయితే ఎంతో కాలంగా పార్టీలో ఉంటున్న తనను పట్టించుకోకపోవడంపై గుర్రుగా ఉన్నారు డాక్టర్ ప్రహ్లాద్. నియోజకవర్గంలోని ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో ఆయన భేటీ అవుతున్నారు. త్వరలో పార్టీ మార్పుపై ప్రకటన చేయనున్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు.
మంత్రులు దయాకర్రావు, సత్యవతి, ఎంపీ కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ప్రహ్లాద్. వారంతా సీఎం కేసీఆర్ను తప్పుదోవ పట్టించి.. బడే నాగజ్యోతికి టికెట్ ఇప్పించారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ములుగు నుంచి పోటీ చేసి.. బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడిస్తామని డాక్టర్ ప్రహ్లాద్ స్పష్టం చేస్తున్నారు.