CBI Includes MLC Kavitha Name As Accused In Delhi Liquor Case: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు మరో షాక్ తగిలింది. కవితను నిందితురాలిగా చేర్చుతూ సీబీఐ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26న విచారణకు రావాలని ఆదేశించింది.
గతంలో సమాచారం కోసం కవితను ప్రశ్నించిన సీబీఐ తాజాగా ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితను నిందితురాలిగా చేర్చుతూ నోటీసులు జారీ చేసింది. మాగుంట రాఘవ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కవితను నిందితుల జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. దీంతో బీఆఎస్ వర్గాల్లో టెన్షన్ మొదలయ్యింది.
కాగా 41-ఎ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చామని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. గత ఛార్జ్ షీట్లో కవిత పేరు ప్రస్తావించని సీబీఐ. కవిత పీఏ ఇచ్చిన సమాచారంతో ఆమెను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆమె పేరును చేర్చడంతో గులాబీ నేతల్లో గుబులు మొదలయ్యింది.