Boy Missing In Telangana: తెలంగాణలో మరో బాలుడు మిస్సింగ్ కలకలం రేపుతోంది. అబిడ్స్లో ఓ చిన్నారిని కిడ్నాప్ చేసిన ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకోవడంతో ఆందోళన నెలకొంది. రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలో 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. ఆదివారం సెలవు కావడంతో రోజు మాదిరిగా ట్యూషన్ వెళ్లాడు. అయితే తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అయితే, ట్యూషన్కి రాలేదని అక్కడి సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే ఆ బాలుడి తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికిన ఫలితం రాలేదు. వెంటనే బంధువుల ఇళ్లల్లో వెతికిన చూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులతో కలిసి మీర్పూట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు మోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాలుగు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాసరి నారాయణరావు కాలనీలో నివాసం ఉంటున్న మధుసూదన్ రెడ్డి, కవితలకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడు మహీధర్ రెడ్డి మీర్పేట్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. అయితే రోజు మాదిరిగా సోదరుడితో కలిసి ట్యూషన్ వెళ్లాడు. తన సోదరుడు ముందే వెళ్లగా.. మహీధర్..ట్యూషన్ వెళ్లలేదు.
Also Read: 13 రోజులు..11 మంది మృత్యువాత..భయం గుప్పిట్లో కొండాపూర్ వాసులు!
అయితే, పోలీసులు చుట్టుపక్కల సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. ఓ బైక్ పై వెళ్తున్నట్లు కనిపించాడు. తర్వాత మీర్పేట్ జంక్షన్లో బస్టాప్ వద్ద బైక్ దిగినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం బస్టాప్ నుంచి నడుచుకుంటూ వెళ్లిన సీసీటీవీ దృశ్యాల ద్వారా కనిపిస్తోంది.
రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలో బాలుడు మిస్సింగ్..
ట్యూషన్కు వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆందోళనలో తల్లిదండ్రులు.
బాలుడిని బైక్ పై తీసుకువెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తి.
సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు.
రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంఘటన. pic.twitter.com/0JSIVnyk3H— ChotaNews (@ChotaNewsTelugu) August 5, 2024