Lok Sabha Elections 2024 Arvind, Madhavilatha Objection on Muslim Votes: లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినయోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు కొన్ని ప్రాంతాల్లో మహిళా ఓటర్లపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత పోలింగ్ కేంద్రానికి వచ్చిన ముస్లిం మహిళా ఓటర్లను పరిశీలించారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి అరవింద్ కూడా బుర్ఖా ధరించి వచ్చిన ఓటర్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత ముస్లిం మహిళా ఓటర్లను తనిఖీ చేశారు. బుర్ఖా ధరించి పోలింగ్ కేంద్రానికి వచ్చిన వారిని పరిశీలించారు. అంతే కాకుండా వారి ఓటర్ ఐడీ, ఆధార్ కార్డులను చూసారు. అనంతరం కొందరి పట్ల ఆమె అనుమానం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న ఉద్యోగులపై మండిపడ్డారు. అసలు ప్రభుత్వం తరపున ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులను నమ్మకూడదు అన్నారు.
Also Read: 11 గంటల వరకు పోలింగ్ ఎంతంటే..?
నిజామాబాద్ లో పోలింగ్ కేంద్రానికి ముస్లిం మహిళా ఓటర్లు ఓటు వేయడానికి వచ్చారు. అయితే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఓటు వేయడానికి ఎవరు వచ్చారు ? అనేది ఎలా గుర్తిస్తారని ఓటర్లను ఉద్దేశించి ప్రిసైడింగ్ ఆఫీసర్ ను ప్రశ్నించారు. మీరు ఏం డ్యూటీ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు బెదిరిస్తే అనుమతిస్తారా అంటూ నిలదీశారు.
In the dance of democracy, look at how veiled Muslim women voters are treated!!
Just look at Madhavi Latha, she’s shaming muslim women for their appearances. And according to UIDAI aadhar photo need to updated every 10 years. The photo might be old..what’s wrong in that.
Arvind… pic.twitter.com/Cvkt3gG3eV— Dr. Extra2ab Ø (@SaffronSalim) May 13, 2024