EPAPER

Muslim Voters: ముస్లిం ఓటర్లపై మాధవీలత, ధర్మపురి అరవింద్ అభ్యంతరం.. వీడియో వైరల్

Muslim Voters: ముస్లిం ఓటర్లపై మాధవీలత, ధర్మపురి అరవింద్ అభ్యంతరం.. వీడియో వైరల్

Lok Sabha Elections 2024 Arvind, Madhavilatha Objection on Muslim Votes: లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినయోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు కొన్ని ప్రాంతాల్లో మహిళా ఓటర్లపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత పోలింగ్ కేంద్రానికి వచ్చిన ముస్లిం మహిళా ఓటర్లను పరిశీలించారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి అరవింద్ కూడా బుర్ఖా ధరించి వచ్చిన ఓటర్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు.


హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత ముస్లిం మహిళా ఓటర్లను తనిఖీ చేశారు. బుర్ఖా ధరించి పోలింగ్ కేంద్రానికి వచ్చిన వారిని పరిశీలించారు. అంతే కాకుండా వారి ఓటర్ ఐడీ, ఆధార్ కార్డులను చూసారు. అనంతరం కొందరి పట్ల ఆమె అనుమానం వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న ఉద్యోగులపై మండిపడ్డారు. అసలు ప్రభుత్వం తరపున ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులను నమ్మకూడదు అన్నారు.

Also Read: 11 గంటల వరకు పోలింగ్ ఎంతంటే..?


నిజామాబాద్ లో పోలింగ్ కేంద్రానికి ముస్లిం మహిళా ఓటర్లు ఓటు వేయడానికి వచ్చారు. అయితే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఓటు వేయడానికి ఎవరు వచ్చారు ? అనేది ఎలా గుర్తిస్తారని ఓటర్లను ఉద్దేశించి ప్రిసైడింగ్ ఆఫీసర్ ను ప్రశ్నించారు. మీరు ఏం డ్యూటీ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు బెదిరిస్తే అనుమతిస్తారా అంటూ నిలదీశారు.

Tags

Related News

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Harish Rao Letter: రాహుల్ గాంధీకి లేఖ రాసిన హరీశ్‌రావు.. పార్టీ మారుతున్నారా..?

Big Stories

×