BJP First List: లోక్సభ ఎన్నికలకు బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో 9 మందికి చోటు దక్కింది. గత లోక్ సభ ఎన్నికల్లో అధిలాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, నిజామాబాద్ స్థానాల్లో గెలుపొందగా.. అందులో ముగ్గురు సిట్టింగ్ లకు ఆరోసారి అవకాశం కల్పించారు. అయితే అదిలాబాద్ లో నుంచి సోయం బాపూరావుకు తొలి జాబితాలో అవకాశం లభించింది.
వీరిలో సికింద్రాబాద్ నుంచి కిషన్రెడ్డి, కరీంనగర్ – బండి సంజయ్, నిజామాబాద్ – అర్వింద్, జహీరాబాద్ – బీబీ పాటిల్, మల్కాజిగిరి – ఈటల రాజేందర్, హైదరాబాద్ – మాధవీలత, చేవెళ్ల -కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి – బూర నర్సయ్య గౌడ్, నాగర్కర్నూల్ – భరత్ ప్రసాద్ పేర్లను ఆ పార్టీ ప్రకటించింది.