EPAPER

BJP Leader Murder: యూసఫ్‌గూడలో దారుణం.. బీజేపీ నేత హత్య!

BJP Leader Murder: యూసఫ్‌గూడలో దారుణం.. బీజేపీ నేత హత్య!

BJP Leader Ramulu Murder: హైదరాబాద్‌లోని యూసఫ్ గూడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాములు అనే వ్యక్తిపై 10 మంది గుర్తు తెలియని దుండగులు అర్థరాత్రి కత్తులతో అతి కిరాతకంగా దాడి చేశారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ రాములు గత కొంతకాలంగా సోషల్ సర్వీసెస్ చేస్తున్నారు. ఆయన గత ఎన్నికల్లో బీజేపీలతో చేరారు.


నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన బీజేపీ నేత సింగోటం రామన్నను గత రాత్రి 11 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని డీసీపీ కృష్ణచైతన్య, జూబ్లీహిల్స్ ఏసీపీ పరిశీలించారు. పాతకక్షల నేపథ్యంలోనే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. రాములు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Read More : NIA Raids : హైదరాబాద్ లో NIA సోదాలు.. వీక్షణం ఎడిటర్ ఇంట్లో తనిఖీలు


ఆటోడ్రైవర్ స్థాయి నుంచి చేపల ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగిన రామన్న.. అబ్దుల్ కలాం ఫౌండేషన్ నుంచి కొంతకాలంగా సోషల్ సర్వీస్ చేస్తూ పేరు సంపాదించుకున్నారు. ముఖ్యంగా పాలమూరు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం సింగోటం ప్రాంతం సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరిన రాములు.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ జిల్లా నుంచి బీజేపీ ఎంపీ టికెట్ ను ఆశిస్తున్నారు. ఈ హత్యకు పాతకక్షలు కారణమా లేక బీజేపీ నుంచి ఎంపీ టికెట్ ఆశించినందుకే అంతమొందించారా అన్న కారణాలు తెలియాల్సి ఉంది. ఈ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×