EPAPER

BJP : బీజేపీ కీలక నిర్ణయం.. రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేత..

BJP : బీజేపీ కీలక నిర్ణయం.. రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేత..

BJP : తెలంగాణలో ఎన్నికలకు ముందు బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేసింది. ఈ మేరకు బీజేపీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు రాజాసింగ్ పై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. గతేడాది ఆగస్టు 23న ఆయన్ను సస్పెండ్‌ చేసింది. వివాదస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తాజాగా రాజాసింగ్ పై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు బీజేపీ కేంద్ర క్రమశిక్షణ సంఘం సభ్య కార్యదర్శి ఓం పాఠక్‌ ప్రకటించారు. 


కాషాయ పార్టీ సస్పెండ్ చేసినా రాజాసింగ్ వేరే పార్టీలోకి చేరేందుకు ప్రయత్నించలేదు. తనపై సస్పెన్షన్ ఎత్తివేస్తారనే నమ్మకంతోనే ఉన్నారు. ఆయన చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. తాను బీజేపీ నుంచి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతాననే విశ్వాసాన్ని ప్రకటించారు. సరిగ్గా ఎన్నికల ముందు ఆయన నిరీక్షణ ఫలించింది. బీజేపీ అధిష్టానం కరుణించింది. రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేసింది.

2018 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒక్క ఎమ్మెల్యే సీటును మాత్రమే సాధించింది. ఆ ఒక్క ఎమ్మెల్యే రాజాసింగ్. ఆయన గోషామహల్ నుంచి వరుసగా రెండోసారి విజయం సాధించారు. ఆ నియోజకవర్గంలో ఆయనకు మంచి పట్టుఉంది. ఇప్పుడు మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇక సస్పెన్షన్ ఎత్తివేయడంతో ఆయనకే గోషామహల్ సీటు దక్కడం ఖాయం. మరి రాజాసింగ్ హ్యాట్రిక్ కొడతారా?


Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×