Malkajgiri Assembly Constituency : తెలంగాణ ఎన్నికలపై బిగ్ టీవీ చేపట్టిన సర్వేలో ఫలితాలపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరి నియోజకవర్గంపై తాజాగా చేపట్టిన సర్వేలో ఓటర్ల తీర్పు ఎటువైపు ఉందో చూస్తే..
నియోజకవర్గం : మల్కాజ్ గిరి
జిల్లా : మేడ్చల్ జిల్లా
మొత్తం ఓటర్లు: 4,69,078
పురుషులు: 2,36,804
మహిళలు :2,32,009
ప్రస్తుత ఎమ్మెల్యే : మైనంపల్లి హన్మంతరావు (BRS)
బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-1 (23-09-2023)
బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి 33 శాతం ఓట్లు సాధిస్తారని బిగ్ టీవీ చేసిన పందెం కోళ్లు-1 సర్వేలో తేలింది. కాంగ్రెస్ అభ్యర్థిగా మైనంపల్లి హన్మంతరావు బరిలోకి దిగితే 51 శాతం ఓట్లు సాధిస్తారని వెల్లడైంది. బీజేపీకి 10 శాతం ఓట్ షేర్ వస్తుందని సర్వేలో తేలింది.
బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2 (05-11-2023)
తాజాగా బిగ్ టీవీ చేసిన బిగ్ టీవీ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మర్రి రాజశేఖర్ రెడ్డికి 31 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు 41 శాతం ఓట్లు సాధిస్తారని తేలింది. ఇక్కడ బీజేపీకి 13 శాతం ఓట్లు వస్తున్నాయి.
పందెంకోళ్లు 1+ పందెంకోళ్లు 2 డిఫరెన్స్
బీఆర్ఎస్ : -2
కాంగ్రెస్ : +1
బీజేపీ : +3
ఇతరులు : -2
మారుతున్న నియోజకవర్గ రాజకీయం
మల్కాజ్గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వైపే విజయం స్పష్టంగా కనిపిస్తోంది. గత సర్వేలో ఆయనకి జనం నుంచి మంచి స్పందన లభించింది. తాజా సర్వేలోనూ మైనంపల్లికి 1 శాతం ఓట్ షేర్ పెరిగి 52 శాతం ఓట్లతో విజయం సాధిస్తారని తేలింది. ఇదే సమయంలో మర్రి రాజశేఖర్రెడ్డికి 2 శాతం ఓట్లు తగ్గాయి.
బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తే కమలం పార్టీకి ఉన్న 13 శాతం ఓట్ షేర్ కూడా ఎటువైపు మళ్లనుందనేది ఆసక్తికరంగా మారుతోంది. మైనంపల్లి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పాార్టీలో చేరినప్పటికీ ఆయన వ్యక్తిగత ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సానుకూల పవనాలు ఉన్నాయనే సంకేతాలు మైనంపల్లి విజయానికి బాటలు వేస్తున్నాయి.
.
.