Nizamabad Urban Assembly Constituency : తెలంగాణ ఎన్నికలపై బిగ్ టీవీ చేపట్టిన సర్వేలో ఫలితాలపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంపై తాజాగా చేపట్టిన సర్వేలో ఓటర్ల తీర్పు ఎటువైపు ఉందో చూస్తే..
నియోజకవర్గం : నిజామాబాద్ అర్బన్
జిల్లా : నిజామాబాద్ జిల్లా
మొత్తం ఓటర్లు: 2,86,766
పురుషులు:1,39,163
మహిళలు : 1,47,571
ప్రస్తుత ఎమ్మెల్యే : గణేష్ గుప్తా (BRS)
బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2 (05-11-2023)
తాజాగా బిగ్ టీవీ చేసిన బిగ్ టీవీ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గణేష్ గుప్తా 30 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ అభ్యర్థి షబ్బీర్ అలీ 34 శాతం ఓట్లు సాధిస్తారని తేలింది. ఇక్కడ బీజేపీకి 31 శాతం ఓట్ షేర్ వచ్చే అవకాశాలున్నాయి. బీజేపీ నుంచి సూర్యనారాయణగుప్తా బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో త్రిముఖపోరు హోరాహోరీగా జరగనుంది.
మారుతున్న సమీకరణాలు
నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు కనిపిస్తోంది. బీఆర్ఎస్ అభ్యర్థి గణేష్ గుప్తా 30 శాతం ఓట్ షేర్ కే పరిమితం అవుతున్నారు. బిగ్ టీవీ ఫస్ట్ సర్వే చేసిన టైంకి..ఇప్పటికి ఆయన ఓట్ షేర్ 5 శాతం తగ్గిపోయింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా షబ్బీర్ అలీ బరిలో దిగితే.. ఆయనకు 34 శాతం ఓట్లు దక్కనున్నాయి.
బీజేపీ కేండెట్ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఓట్ షేర్ కూడా గతంతో పోలిస్తే 5 శాతం ఓట్ షేర్ పెరిగింది. మొత్తానికి నిజామాబాద్ అర్బన్లో ట్రాయంగిల్ ఫైట్ నడుస్తుండగా.. షబ్బీర్ అలీ పోటీ చేస్తే విజయం ఆయన్నే వరించనుంది. మైనార్టీ నేతగా ఆయన విక్టరీ ఖాయమని బిగ్ టీవీ ఎలకన్ సర్వేలో ఓటర్ల అభిప్రాయంగా కనిపించింది.
.
.