Pinapaka : తెలంగాణ ఎన్నికలపై బిగ్ టీవీ చేపట్టిన సర్వేలో ఫలితాలపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంపై తాజాగా చేపట్టిన సర్వేలో ఓటర్ల తీర్పు ఎటువైపు ఉందో స్పష్టంగా తెలుస్తోంది. ఈ సెగ్మెంట్ లో 1,94,145 ఓట్లు ఉన్నాయి. అందులో పురుషులు 95,704 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 98,235 మంది ఉన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే రేగా కాంతారావు.
బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-1 (05-10-2023)
బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావుకు 43 శాతం ఓట్లు సాధిస్తారని బిగ్ టీవీ చేసిన పందెం కోళ్లు-1 సర్వేలో తేలింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పాయం వెంకటేశ్వర్లు బరిలోకి దిగితే 43 శాతం ఓట్లు సాధిస్తారని వెల్లడైంది. ఇక్కడ ఇతరులకు 11 శాతం ఓట్లు పడుతాయని తెలిసింది.
బిగ్ టీవీ సర్వే.. పందెం కోళ్లు-2 (04-11-2023)..
తాజాగా బిగ్ టీవీ చేసిన బిగ్ టీవీ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేగా కాంతారావుకి 45 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లుకు 49 శాతం, బీజేపీకి 3, ఇతరులకు 3 శాతం ఓట్లు వస్తాయని తేలింది.
సమీకరణాలు మారుతున్నాయ్..
రెండు సర్వేల ఆధారంగా ఓట్ల లెక్కలు పరిశీలిస్తే బీఆర్ఎస్ కు 2 శాతం ఓట్లు పెరుగుతుండగా.. కాంగ్రెస్ కు ఏకంగా 6 శాతం ఓట్లు పెరుగుతున్నట్లు స్పష్టంగా తేలింది.
పినపాకలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇన్ ఫ్లూయెన్స్ కాంగ్రెస్ అభ్యర్థికి కలిసి వస్తోంది. పందెంకోళ్లు 1 సర్వే సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరా హోరీ పోరు ఉండగా… ప్రస్తుతం పరిణామాలు మారిపోయాయి. పాయం వెంకటేశ్వర్లుకు 6 శాతం ఓట్లు పెరిగాయి. అధికార పార్టీకి ప్రజా వ్యతిరేకత ఎదురవుతుండగా కాంగ్రెస్ పార్టీకి 6 గ్యారెంటీలతో భరోసా మరింత పెరుగుతోంది. పినపాకలో ఇప్పటికిప్పుడు విజయం పాయం వెంకటేశ్వర్లువైపే ఉండనుంది.
.
.