తెలంగాణ హైకోర్టులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. రేవంత్ రెడ్డి పై మై హోమ్ రామేశ్వర్ రావు వేసిన పరువు నష్టం దావా కేసును హైకోర్టు కొట్టేసింది. 2014లో మై హోమ్ భుజాకు సంబందించిన భూమి విషయంలో.. రేవంత్ రెడ్డి భూ ఆక్రమణలపై ఆధారాలతో సహా పత్రిక సమావేశంలో ప్రశ్నించారు.ఈ విషయమై మైహోం రామేశ్వర్ రావ్.. రేవంత్ రెడ్డి పై రూ.90 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఇంతకాలం కేసును పరిశీలించిన హైకోర్టు..కేసు నిరాధారమైందని కొట్టేసింది.
కాగా.. సీఎం కేసీఆర్ అండదండలు చూసుకుని హైటెక్ సిటీ ప్రాంతంలో మై హోం సంస్థ అక్రమాలకు పాల్పడిందని 2014లో రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ఆరోపణల కారణంగా తమ సంస్థ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగిందని, అందుకు రూ.90 కోట్లు పరువు నష్టం కింద చెల్లించాలంటూ రామేశ్వర్ రావు రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపారు. ఈ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. ఈ కేసు నిరాధారమైనదని పేర్కొంటూ.. నేడు కొట్టివేసింది.