BRS: బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. BRS రాష్ట్ర కార్యదర్శి మందుల సామేలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మాదిగలకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందని ఆయన మండిపడ్డారు. 75 ఏళ్ల మాదిగులను మంత్రివర్గంలోకి తీసుకోని సీఎం ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆరేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగుల మనోభావాలను కేసీఆర్ దెబ్బతీశారని అన్నారు.
తుంగతుర్తి నియోజకవర్గంలో గురువారం ప్రగతినివేదన సభను బీఆర్ఎస్ నిర్వహించింది. ఈ సభలో గాదరి కిశోర్ను తుంగతుర్తి నుంచి అభ్యర్ధిగా కేటీఆర్ ప్రకటించారు. దీంతో పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. టికెట్ తనకు వస్తుందని ఆశాభవంతో ఉన్న సామేలు ఒక్కసారి భగ్గుమన్నారు.
గతంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్గా మందుల సామేలు పని చేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆయన కేసీఆర్ తోనే ఉన్నారు. 2014, 2018 ఎన్నికల్లో కూడా ఆశించినా టికెట్ దక్కలేదు. ఈసారి కూడా టికెట్ రాదని స్పష్టత రావడంతో పార్టీకి రాజీనామా చేశారు. మూడు, నాలుగు రోజుల్లో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానన్నారు సామేలు.