Telangana BIG Cricket League: మరో బిగ్గెస్ట్ ఈవెంట్ కు వేదికైంది హైదరాబాద్. పోలీస్ వారియర్స్, బుల్లితెర హీరోస్, పొలిటికల్ వారియర్స్ తో పాటు.. టీవీ టైగర్స్, టాలీవుడ్ హీరోస్ కాంబోలో తెలుగు సెలబ్రెటీ లీగ్ జరుగుతుంది. అజీజ్ నగర్లోని MRR క్రికెట్ గ్రౌండ్లో ఈ లీగ్ ఫస్ట్ ఎడిషన్ మొదలైంది. ఈరోజు ఉదయం ప్రారంభమై మ్యాచ్ లో పోలీస్ వారియర్స్, బుల్లితెర హీరోస్ తలపడుతున్నారు.
ఈ క్రికెట్ లీగ్లో ఐదు టీమ్స్ ఉండనున్నాయి. లీగ్ మ్యాచ్ల్లో టాప్లో నిలిచిన రెండు టీమ్స్ ఫైనల్స్లో తలపడనున్నాయి. ఫైనల్తో కలిపి మొత్తం ఏడు మ్యాచ్లు ఆడనున్నాయి టీమ్స్.. ఫైనల్స్లో గెలిచిన వారికి 3 లక్షల రివార్డ్, రన్నరప్ టీమ్కు లక్ష రూపాయల రివార్డ్ అందించనున్నారు. దీనికి టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది బిగ్ టీవీ.
అయితే ఇందులో వినోదంతో పాటు.. మంచి సందేశం కూడా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. సే నో టు డ్రగ్స్.. ఇదే థీమ్ అండ్ మెసేజ్తో ఈ లీగ్ ఆడనున్నారు. డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో మేము సైతం అంటూ దానికి ఈ లీగ్ను వేదికగా చేసుకోనున్నారు.