EPAPER

Bharat Jodo Yatra : మహబూబ్ నగర్ లో భారత్ జోడో యాత్ర..పాదయాత్రలో పాల్గొన్న పూనమ్ కౌర్

Bharat Jodo Yatra : మహబూబ్ నగర్ లో భారత్ జోడో యాత్ర..పాదయాత్రలో పాల్గొన్న పూనమ్ కౌర్

Bharat Jodo Yatra : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. తెలంగాణలో నాలుగో రోజు మహబూబ్ నగర్ మండల పరిధిలోని ధర్మాపూర్ లోని జయప్రకాశ్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ప్రారంభమైంది. రాహుల్ తోపాటు పార్టీ జాతీయ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్, తెలంగాణ కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, మధుయాష్కీ , పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సీతక్క పాదయాత్రలో పాల్గొన్నారు. 15 కిలోమీటర్ల పాటు సాగిన పాదయాత్రలో చిన్నారులు, యువకులు, మహిళలు, కళాకారులు, వివిధ సంఘాల నేతలు, కార్మికులతో రాహుల్ ముచ్చటించారు. ఇదే సమయంలో సినీనటి పూనమ్ కౌర్ భారత్ జోడో యాత్రలో ప్రత్యక్షమయ్యారు. ఆమె రాహుల్ తోపాటు భారత్ జోడో యాత్ర చేశారు. భద్రాచలం నుంచి వచ్చిన గిరిజనులతో కలిసి రాహుల్ సంప్రదాయ నృత్యం చేసి ఆకట్టుకున్నారు. చేనేత కార్మికులు వారి సమస్యలను రాహుల్ దృష్టికి తీసుకొచ్చారు. ఎన్ఎస్ యూఐ ఆధ్వర్యంలో 3 వేల మంది విద్యార్థులతో ర్యాలీ చేశారు. ఉస్మానియా , కాకతీయ విశ్వవిద్యాలయాల విద్యార్థలు రాహుల్ కలిసి వర్శిటీ సమస్యలను వివరించారు.


Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×