Batti Vikramarka : బీఆర్ఎస్ పాలనపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. శనివారం భద్రాద్రి పవర్ ప్లాంట్పై డిప్యూటీ సీఎం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మాతోనే కరెంట్ అని చెప్పిన బీఆర్ఎస్ నేతలు భారీగా అప్పులు చేశారని దుయ్యబట్టారు.విద్యుత్ కొనుగోలుకు రూ.30 వేల కోట్లు వెచ్చించారన్నారు.
Batti Vikramarka : బీఆర్ఎస్ పాలనపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. శనివారం భద్రాద్రి పవర్ ప్లాంట్పై డిప్యూటీ సీఎం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మాతోనే కరెంట్ అని చెప్పిన బీఆర్ఎస్ నేతలు భారీగా అప్పులు చేశారని దుయ్యబట్టారు.విద్యుత్ కొనుగోలుకు రూ.30 వేల కోట్లు వెచ్చించారన్నారు.
జెన్ కోకు కట్టాల్సిన బకాయిలు రూ.9 వేల కోట్లకు పైగా ఉన్నాయని భట్టి తెలిపారు. సింగరేణికి రూ. 19 వేల కోట్లు బకాయిలు పడ్డారన్నారు. రాష్ట్ర విభజన నాటికి రూ.7 వేల కోట్లు మాత్రమే బకాయిలు ఉన్నాయని తెలిపారు. కానీ ప్రతి శాఖలో అప్పులతో రాష్ట్రాన్ని తాకట్లు పెట్టారన్నారు. విద్యుత్ కొనుగోలు పేరుతో రూ.59 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని భట్టి మండిపడ్డారు.