Basara : నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి అదనపు సొబగులు అద్దడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం 50 కోట్లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన పనులను దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ పరిశీలించారు. ఆలయంలో చేపట్టాల్సిన పనులను స్థపతి వల్లి నాయగం, ఇంజనీరింగ్, ఆలయ అధికారులతో కలిసి పరిశీలించారు.
రెండు నెలల్లో మాస్టర్ ప్లాన్ పనులు ప్రారంభిస్తామని దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. ఇప్పటికే 8 కోట్లతో వసతి భవనాలు నిర్మించామని చెప్పారు. అటు గోదావరి నది వద్ద ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. నదితీరంలో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసి, నదిలో బోట్ల ద్వారా పర్యవేక్షణ చేస్తామని అధికారులు తెలిపారు.