EPAPER

Bandi Sanjay comments: ఆ మాటంటే చెప్పుతో కొట్టండి.. బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు..

Bandi Sanjay comments: ఆ మాటంటే చెప్పుతో కొట్టండి.. బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు..

Bandi Sanjay sensational comments: తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. నాయకుల మధ్య మాటలు ఘాటెక్కిపోతున్నాయి. చెప్పులతో కొట్టాలంటూ ప్రజలకు రాజకీయ నాయకులు పిలుపునివ్వడం రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం దూమారం రేపుతోంది. మొన్నటికి మొన్న రైతుబందు అడిగిన వాళ్లను చెప్పుతో కొట్టండి అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. కాగా.. ఇప్పుడు బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ కుమార్ అచ్చం అలాగే ఘాటు వ్యాఖ్యలు చేశారు.


లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతుంటే..రాష్ట్రంలో పార్టీలు మారే వారి గురించి, పొత్తుల గురించి రకరకాల వార్తలు ప్రచారమవుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీతో, బీఆర్ఎస్ పార్టీల పొత్తు పెట్టుకోబోతోందంూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలోనే బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మంతనాలు కూడా జరుపునన్నట్లు ప్రచారం సాగుతుంది. ఈ అంశంపై బీజేపీ నేతలు స్పందిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్పందించినటువంటి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఛీ కొట్టారని బండి సంజయ్ అన్నారు. అలాంటి పార్టీతో తాము ఎందుకు పొత్తుపెట్టుకుంటామన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకునే ఆస్కారం లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మద్య పొత్తు ఉంటుందని అనేవాళ్లను చెప్పుతో కొట్టండి అంటూ ఘాటుగా స్పందించారు బండి సంజయ్. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్య లోపాయికార ఒప్పందం ఉందన్నారు. అందుకే బీజేపీని దెబ్బతీయడానికి బీఆర్ఎస్ తో పొత్తు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.


Read More:  రెండు లివర్లు ఎక్స్‌ట్రా ఆంటీని ఫాలో.. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ట్వీట్‌

బీజేపీ వైపు శ్రీ రాముడు, ప్రధాని నరేంద్రమోదీ ఉన్నారని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ వైపు రాక్షసులు ఉన్నారన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు హిందుత్వం, ధర్మ సంరక్షణ కోసం పోరాడుతూనే ఉంటానన్నారు. కేంద్రంలో బీజేపీ ముచ్చటగా మూడవ సారి అధికారంలోకి రాబోతుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. దేశానికి మూడవ సారి నరేంద్రమోదీ ప్రధానమంత్రి కాబోతున్నారని బండి సంజయ్ జోస్యం చెప్పారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×