Bandi Sanjay : తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ మాజీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టలో అవినీతి ఉందని, బీసీలకు గులాబీ పార్టీ మోసం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bandi Sanjay : తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ మాజీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆదివారం ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, బీసీలకు గులాబీ పార్టీ మోసం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ బీసీలకు 23 సీట్లే ఇచ్చిందని, కాంగ్రెస్ 19 సీట్లే ఇచ్చిందని అన్నారు. ఆ రెండు పార్టీలు బీసీలకు వ్యతిరేకమని ఎత్తిచూపారు.బీసీలను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. అందుకే మంత్రి గంగుల కమలాకర్కి బీఆర్ఎస్ పార్టీ బీ-ఫామ్ ఇవ్వలేదని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీలో నేతలందరూ సీఎం పదవి కోసం గొడవపడుతున్నారని అన్నారు. అందుకే గాంధీ భవన్ను సీఎం పొగ కమ్మేసిందని చెప్పారు. సీఎం పదవి రేసులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చివరికి బకరా అవుతారని జోస్యం చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.. “క్షుద్ర పూజలు చేయడమే కాదు.. అప్పుడప్పుడూ కట్టిన ప్రాజెక్టులు కూడా పరిశీలించాలి” అని సీఎం కేసీఆర్ని ఉద్దేశించి ఘాటుగా విమర్శించారు. “మోటార్లు మునిగింది వాస్తవం.. ప్రాజెక్టు కుంగింది వాస్తవం.. పిల్లర్లకు పగుళ్లు వాస్తవం” అని బీఆర్ఎస్పై తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ తిన్నదంతా కక్కిస్తామని, కాళేశ్వరం కేసీఆర్ తాత ఆస్తి కాదని అన్నారు. ‘‘కేటీఆర్.. నీ అయ్యను పట్టుకుని రా..కాళేశ్వరం దగ్గరకు నిపుణులను పట్టుకుని రా.. నా సవాల్కు సిద్ధమా..’’ అంటూ విరుచుకుపడ్డారు.