Bandi Sanjay : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి విమర్శలు గుప్పించారు. కవిత ఇంటికి సీబీఐ అధికారులు ఛాయ్, బిస్కెట్ తినడానికి రాలేదని సెటైర్లు వేశారు. కవిత ఇంటి వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద పెద్ద హోరింగ్స్ , ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపైనా మండిపడ్డారు. ఆమె స్వతంత్ర సమరయోధురాలా? అని ప్రశ్నించారు. పెద్ద పెద్ద హోరింగ్స్ ఎందుకని నిలదీశారు. తప్పు చేసిన వారు హోర్డింగ్స్ పెట్టుకుంటున్నారని విమర్శించారు.
తప్పు చేసిన బీఆర్ఎస్ నేతలు జైలుకు వెళ్లాల్సిందేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. సీబీఐ విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత దొరికిపోయారని.. చట్టం తన పని తాను చేస్తుందని బండి సంజయ్ అన్నారు.
మరోపైపు బండి సంజయ్ చేపట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఆదివారం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి ప్రారంభమైంది. వెంకటాపూర్ నుంచి మోహన్ రావుపేట వరకు ప్రతీ గ్రామంలోనూ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను బండి సంజయ్ అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. పాదయాత్రలో వివిధ వర్గాల సమస్యలు తెలుసుకుంటూ బండి సంజయ్ ముందుకు సాగుతున్నారు.