Ayodhya Ram Mandir On Wheels : అయోధ్య ఆలయ ప్రారంభోత్సవ వేళ కొందరు రాముడి పట్ల భక్తిను చాటుకుంటున్నారు. వినూత్నమైన మార్గాలు ఎంచుకుంటున్నారు. హైదరాబాద్ లో ఓ భక్తుడు అచ్చం అయోధ్య లోని రామమందిరాన్ని పోలినట్లుగా కారు తయారుచేశారు. సుధా కార్స్ మ్యూజియం యజమాని సుధాకర్ యాదవ్ ఈ ప్రత్యేకమైన కళాఖండాన్ని రూపొందించారు.
సుధాకర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. 2020లో అయోధ్యలోని పవిత్రమైన మైదానం యొక్క ‘భూమిపూజన్’ వేడుకను నిర్వహించినప్పటి నుంచి రెండు సంవత్సరాలుగా తాను రామాలయం ప్రతిరూప కారు ప్రాజెక్ట్ను ప్లాన్ చేస్తున్నానని చెప్పారు. 10 మంది ముస్లిం కార్మికులతో సహా 21 మంది బృందం పనిచేశారని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్ట్పై నిజమైన ఆలయానికి సంబంధించిన ప్రతి చిన్న వివరాలను ప్రతిరూపంపై సూక్ష్మంగా రూపొందించడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేశామని యాదవ్ తెలిపారు.
జనవరి 19 నుంచి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి నుమాయిష్ లో తన రామ మందిర ప్రతిరూప కారును ప్రదర్శించాలని యాదవ్ అనుకుంటున్నారు. రామమందిర రూపంలో ఉన్న కారును గ్రామగ్రామానికి తిప్పుతానని తెలిపారు. ఇలా ప్రజలకు అయోధ్య రాముడి దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పారు.