Gandhi Hospital: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. విధుల్లో ఉన్న వైద్యురాలిపై దాడి జరిగింది. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వచ్చిన కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో బుధవారం మహిళా జూనియర్ డాక్టర్ పై రోగి సహాయకుడు దాడికి పాల్పడ్డాడు. ట్రీట్మెంట్ చేస్తున్న సమయంలో మహిళా వైద్యురాలిపై దాడి చేసిన అతడు దాడికి పాల్పడ్డాడు. అప్రాన్ లాగి, దాడి చేయడంతో అతడి బారి నుంచి ఇతర సిబ్బంది ఆ జూనియర్ డాక్టర్ ను కాపాడారు. వైద్యురాలిపై దాడికి పాల్పడిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని చిలకలగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై జూనియర్ డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆందోళనకు కూడా వారు సిద్ధమవుతున్నారు. అయితే, రోగి సహాయకుడు దాడికి పాల్పడటానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read: సెప్టెంబర్ 17పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రజాపాలన దినోత్సవంగా..