EPAPER

Asaduddin Owaisi: పీఓకేపై.. ఎన్నికల వేళ ఎందుకీ వ్యాఖ్యలు ? : ఒవైసీ

Asaduddin Owaisi: పీఓకేపై.. ఎన్నికల వేళ ఎందుకీ వ్యాఖ్యలు ? : ఒవైసీ

Asaduddin Owaisi On POK: లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు ఐదు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మరో రెండు విడతలు ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. పార్టీల నేతలు ఎన్నికల ప్రసంగాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేస్తున్నారు.


ఈ క్రమంలోనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బీజేపీపై విరుచుకుపడ్డారు. పీఓకే భారత్ లో అంతర్భాగమని తాము కూడా చెబుతున్నామని అన్నారు. తిరిగి స్వాధీనం చేసుకోవాలని అందరు కోరుకుంటున్నారని వెల్లడించారు. బీజేపీ మాత్రం ఎన్నికల సమయంలోనే ఈ అంశాన్ని తెరపైకి ఎందుకు తెస్తుందని ప్రశ్నించారు. బీజేపీ నేతలు ఎన్నికల సమయంలో కావాలనే పీఓకే గురించి తరుచూ మాట్లాడుతున్నారని ఆరోపించారు.

Also Read: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. ఏసీపీ ఉమామహేశ్వరరావుకు జ్యుడీషియల్ రిమాండ్


పదేళ్లలో పీఓకేను స్వాధీనం చేసుకునేందుకు ఏం చేశారో చెప్పాలని అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. మొదట్లో 400కు పైగా సీట్లు గెలుస్తామని చెప్పిన బీజేపీ మరి ఇప్పుడెందుకు చెప్పడం లేదని అన్నారు. పెట్రోల్ ధరలు రూ. 100 దాటాయని మండిపడ్డారు. మోదీ పోటీ చేస్తున్న వారణాసిలో పేపర్ లీక్ ఘటనల విషయాలను బీజేపీ మరుగున పడేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.

Related News

Balapur Laddu: 1994లో రూ. 450.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే!

New Ration Cards: కొత్త రేషన్ కార్డులకు డేట్ ఫిక్స్.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

Rajiv Gandhi: ఆ పార్టీ పెద్ద సొంత విగ్రహం పెట్టుకోడానికే ఆ ఖాళీ ప్లేస్.. బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

Telangana Liberation Day: విమోచన దినోత్సవంగా నిర్వహిస్తేనే హాజరవుతా: కేంద్రమంత్రి బండి

Rajiv Gandhi Statue: సచివాలయంలోని రాజీవ్ గాంధీ విగ్రహ ప్రత్యేకత ఏమిటీ?

Nursing student death: గచ్చిబౌలి హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి.. రూమంతా రక్తం, హత్యా.. ఆత్మహత్యా?

Harish Rao: హరీశ్ రావు యాక్ష‌న్ షురూ.. కేసీఆర్ శకం క్లోజ్ అయినట్లేనా?

Big Stories

×