Congress: టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పాదయాత్ర సక్సెస్ఫుల్గా సాగుతోంది. హాత్ సే హాత్ జోడో యాత్రకు అనూహ్య స్పందన వస్తోంది. కాంగ్రెస్ కేడర్లో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది. ఈ జోష్ను ప్రత్యర్థులు తట్టుకోలేకపోతున్నారు. పలుచోట్ల దాడులకు తెగబడుతున్నారు. రేవంత్ ర్యాలీకి హాజరైన యూత్ కాంగ్రెస్ నేత తోట పవన్పై కొందరు దుండగులు దాడికి పాల్పడటం కలకలం రేపుతోంది. తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చేరాడు తోట పవన్. ఈ దాడి బీఆర్ఎస్ గుండాల పనేనంటూ మండిపడింది కాంగ్రెస్.
తోట పవన్పై దాడి విషయం తెలిసి హాస్పిటల్కి వెళ్లి పరామర్శించారు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి. పవన్కు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వరంగల్ సీపీ రంగనాథ్ను కలిసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ వెంట సీతక్క, కొండా సురేఖ, కొండా మురళి, రాజయ్య, నాయిని రాజేందర్రెడ్డి తదితరులు తరలివచ్చారు.
అటు, NSUI నేతలు హైదరాబాద్లో డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. హనుమకొండ కమిషనరేట్ ముందు సైతం విద్యార్థి విభాగం ఆందోళన చేపట్టింది. ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇలా ఓ కార్యకర్తకు అండగా కాంగ్రెస్ శ్రేణులంతా ముందుకు రావడం ఆసక్తికరం. రేవంత్రెడ్డి నాయకత్వాన్ని ప్రశంసిస్తున్నారు నేతలు. ఘటన జరిగిన హనుమకొండలో.. అటు హైదరాబాద్లో ఒకేసారి ఒత్తిడి పెంచడంతో పోలీసులు చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి వచ్చింది. తోట పవన్పై దాడి చేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. మిగతా వారు పరారీలో ఉన్నారు. వారికోసం గాలిస్తున్నారు.