Hyderabad : హైదరాబాద్లోని లంగర్హౌస్లో సంక్రాంతి పండుగ వేళ విషాద ఘటన చోటుచేసుకుంది. లంగర్హస్ ఫ్లైఓవర్ వద్ద చైనా మాంజా తగిలి ఇండియన్ ఆర్మీలో పని చేసే కోటేశ్వర్ రెడ్డి అనే జవాన్ ప్రాణాలు కోల్పోయారు. విధులు ముగించుకుని బైక్పై ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మాంజా దారం మెడకు చుట్టుకుని కోటేశ్వర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఆయనకు తోటి సిబ్బంది కన్నీటి వీడ్కోలు పలికారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన కోటేశ్వర్ రెడ్డి లంగర్ హౌస్లో నివాసం ఉంటూ ఆర్మీలో డ్రైవర్గా పనిచేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.