Nagarjunasagar AP Border: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల జరుగుతుండగా.. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఆంధ్రా తెలంగాణ సమస్య మొదలైంది. దీనికి ఎవరో నిరసనకారులు కారణం కాదు. ఏకంగా పోలీసులే ఈ సమస్యను లేవనెత్తారు
Nagarjunasagar AP Border: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల జరుగుతుండగా.. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వద్ద ఆంధ్రా తెలంగాణ సమస్య మొదలైంది. దీనికి ఎవరో నిరసనకారులు కారణం కాదు. ఏకంగా పోలీసులే ఈ సమస్యను లేవనెత్తారు.
ఓవైపు తెలంగాణలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతుండగా.. ఏపీ అధికారులు, పోలీసులు బుధవారం అర్ధరాత్రి నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువ నుంచి 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇది తెలిసిన తెలంగాణ పోలీసులు అక్కడికి చేరుకొని వారిని అడ్డుకోబోయారు. దీంతో తెలంగాణ పోలీసులు, ఏపీ పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది.
ఓటింగ్ సమయంలో ఆంధ్రా తెలంగాణ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఏపీ బోర్డర్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నాగార్జున సాగర్, మాచర్ల మార్గంలో తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రదేశ్ వైపు వచ్చే వాహనాలను ఏపీ పోలీసులు అడ్డుకుంటున్నారు. ఏపీ అడ్రస్ ఉన్న ఆధార్ కార్డు ఉన్న వారికి మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. తెలంగాణ వాసులకు పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు.