Vande Bharat: తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్. అతి త్వరలో మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చక్కర్లు కొట్టనుంది. సికింద్రాబాద్-తిరుపతి మధ్యలో ఈ రైలు అందుబాటులో ఉండనుంది. దీని ద్వారా తిరుపతికి వెళ్లే భక్తులు కేవలం 7గంటల్లోనే సికింద్రాబాద్ నుంచి తిరుపతి చేరుకోవచ్చు.
తిరుపతికి వెళ్లాలంటే ప్రస్తుతం మూడు వారాల ముందే టికెట్ బుక్ చేసుకుంటే కానీ రిజర్వేషన్ దొరకని పరిస్థితి ఉంది. ఈక్రమంలో భక్తులకు వందేభారత్ ఎక్స్ప్రెస్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. ఏప్రిల్ 8న తిరుపతిలో ఈ రైలును ప్రారంభించే అవకాశం ఉంది. ఈ రైలును సికింద్రాబాద్-నల్గొండ-మిర్యాలగూడ-గుంటూరు మార్గాల్లో నడిపించాలని రైల్వేశాఖ నిర్ణయించింది.
కాగా ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి వందేభారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. సంక్రాంతి నుంచి ఈ రైలు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ట్రైన్ సికింద్రాబాద్-విశాఖ మధ్యలో నడుస్తోంది.