Medico suicide : వరంగల్ జిల్లా కాకతీయ మెడికల్ కళాశాలలో మరో పీజీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. లాస్య అనే పీజీ సెకండ్ ఇయర్ విద్యార్థి నిద్రమాత్రలు వేసుకొని ఆత్మహత్యాయత్నం చేసిందని ప్రచారం జరిగింది.
KMCలో పీడియాట్రిక్ విభాగంలో పీజీ రెండో సంవత్సరం చదువుతుంది లాస్య. నిన్న రాత్రి ఎంజీఎంలో విధులు నిర్వహించింది లాస్య. అయితే వర్క్ లోడ్ ఎక్కువ కావడంతో మైగ్రేన్ కారణంగా మెటాప్రోనాల్ మాత్రలు వేసుకుందని కేఎంసి యాజమాన్యం చెబుతోంది.
ఓవర్ డోస్ కారణంగా అస్వస్థత గురైనట్లు తెలిపారు. ప్రస్తుతం లాస్య పరిస్థితి స్టేబుల్గా ఉందని కేఎంసీ ప్రిన్సిపల్ మోహన్ దాస్ తెలిపారు. KMCలో ఎలాంటి వేధింపులు, ర్యాగింగ్ జరగలేదని అధికారులు అంటున్నారు. తనకు మైగ్రెన్ ఉందని.. అందుకే టాబ్లెట్స్ వేసుకున్నట్టు బాధితురాలు లాస్య చెబుతోంది.
అయితే, ఓ మెడికల్ పీజీ స్టూడెంట్ ఓవర్ డోస్ అయ్యేంతగా స్లీపింగ్ పిల్స్ ఎలా తీసుకుంటుంది? ఆమెకు ఆమాత్రం తెలీదా? అధికారులు కావాలనే అలా చెబుతున్నారా? లాస్యతోనే అలా చెప్పిస్తున్నారా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది.