BJP : తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఖారారైనట్లు తెలుస్తోంది. జనసేనకు పన్నెండు స్థానాలు కేటాయించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించిందని ప్రచారం జరుగుతోంది. తొలి లిస్టులో కేవలం బీజేపీ అభ్యర్థులను మాత్రమే ప్రకటిస్తారని అంటున్నారు. రెండో లిస్టులో జనసేన అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది.
హుజూరాబాద్, గజ్వేల్ నుంచి రెండు చోట్ల ఈటల రాజేందర్ పోటీ చేస్తారని తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో పోటీకి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ దూరంగా ఉంటారని టాక్. బీసీ సీఎం నినాదంతో బీజేపీ ముందుకెళ్లాలని భావిస్తోందని సమాచారం.
జనసేనకు కేటాయించే స్థానాలపై బీజేపీ అధిష్టానం క్లారిటీకి వచ్చిందని తెలుస్తోంది. కూకట్ పల్లి, వైరా, అశ్వారావుపేట, కోదాడ, సూర్యాపేట, వరంగల్, కరీనంగర్ స్థానాలను జనసేనకు కేటాయించే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాలో మూడు స్థానాలు, నల్గొండ జిల్లాలో రెండు స్థానాలు, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఒక్కో స్థానం జనసేనకు బీజేపీ కేటాయిస్తుందని వార్తలు వస్తున్నాయి.
ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. తెలంగాణ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో పొత్తులు కొలిక్కివచ్చాయి. జీహెచ్ ఎంసీ ఎన్నికల జనసేన పోటీ చేయలేదు. బీజేపీకి మద్దతు ఇచ్చింది. ఇప్పుడు కూడా జనసేన పోటీలో ఉండదని అందరూ భావించారు. కానీ తెలంగాణలోని జనసేన, నాయకులు , కార్యకర్తల అభిప్రాయాలను తీసుకున్న పవన్ కల్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి మొగ్గుచూపించారు. ఈ క్రమంలోనే బీజేపీ, జనసేన మధ్య సీట్ల పంపకాలపై అవగాహన కుదిరిందని తెలుస్తోంది.