Abraham : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ లు తగులుతున్నాయి. తాజాగా అలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ కు గట్టి షాక్ తాకింది. ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే అలంపూర్కు చెందిన.. నలుగురు జెడ్పీటీసీలు, ముగ్గురు ఎంపీపీలు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు కాంగ్రెస్ లో చేరారు.
తనకు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో అబ్రహం మనస్థాపం చెందారు. తొలుత టికెట్ ఆయనకే ప్రకటించినప్పటికీ.. తర్వాత బీఆర్ఎస్ కీలక నేత చల్లా మనిషి విజయుడికి బీ ఫామ్ ఇచ్చారు గులాబీ బాస్. దీంతో కొన్నిరోజులుగా రాజకీయాలకు అబ్రహం దూరంగా ఉంటూ వచ్చారు.
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అబ్రహం కీలక నిర్ణయం తీసుకున్నారు. తనను నమ్ముకున్న కేడర్ కోసం పార్టీ మారానన్నారు. అయితే అబ్రహం చేరికతో అలంపూర్ లో కాంగ్రెస్ మరింత బలపడింది. ఇప్పటికే మాజీ ఎంపీ మంథా జగన్నాథం కూడా కాంగ్రెస్ లో చేరారు. ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గంలో అగ్రకులాల పెత్తనంపై సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చల్లా పెత్తానాన్ని అడ్డుకునేందుకు ఏకతాటిపైకి వస్తున్నారు..
.
.
.