రాజ్భవన్లో గవర్నర్ తమిళిసై ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఒవైసీతో ప్రమాణం చేయించారు. సాధారణంగా సీనియర్ సభ్యులకు ప్రొటెం స్పీకర్ బాధ్యతలు అప్పగిస్తుంటారు. ఇందులో భాగంగా ఆ బాధ్యతలు నిర్వహించాలని అక్బరుద్దీన్ను కోరగా అందుకు ఆయన అంగీకరించారు. ప్రొటెం స్పీకర్ గా బాధ్యతలు చేపట్టారు.
తెలంగాణ కొత్త శాసనసభ నేడు కొలువుదీరనుంది. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్గా వారితో ప్రమాణం చేయిస్తారు.