EPAPER

Thummala Nageswara Rao : సకాలంలో రైతులకు విత్తనాలు సరఫరా చేయండి.. మంత్రి తుమ్మల ఆదేశం..

Thummala Nageswara Rao : సకాలంలో రైతులకు విత్తనాలు సరఫరా చేయండి.. మంత్రి తుమ్మల ఆదేశం..

Thummala Nageswara Rao : రైతులకు విత్తన సరఫరా, తెలంగాణ విత్తన రంగ అభివృద్ధి పై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సచివాలయంలో ఉన్నత అధికారులు, విత్తన కంపెనీల ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. వ్యవసాయ శాఖ, విత్తన ధ్రువీకరణ సంస్థ , విత్తనాభివృద్ధి సంస్థ, వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, విత్తన కంపెనీల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.


వచ్చే సీజన్ లో రైతులకు విత్తన సరఫరాపై మంత్రి తుమ్మల అధికారుల సమీక్ష చేశారు. ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న విత్తనాల సరఫరాపై చర్చించారు. అదేవిధంగా రైతులకు విత్తనాల విషయంలో ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విత్తన సరఫరా విషయంలో తెలంగాణ రైతులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని విత్తన కంపెనీల ప్రతినిధులకు సూచించారు. ఆ తర్వాతే ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసుకోవాలని కంపెనీలకు మంత్రి స్పష్టం చేశారు.

రాష్ట్రంలో నకిలీ విత్తనాల సరఫరా లేకుండా చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. నకిలీ విత్తనాల సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశంచేశారు. నకిలీ విత్తనాల వల్ల రైతులకు ఏదైనా నష్టం జరిగితే విత్తన కంపెనీలే తగిన నష్ట పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ విత్తన రంగ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తుమ్మల తెలిపారు.


Related News

Singareni: సింగరేణి లాభాల్లో కార్మికులకు 33 శాతం వాటా.. తొలిసారి కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ కి కూడా.. : సీఎం రేవంత్

Kaleshwaram project: కాళేశ్వరం ప్రాజెక్టు.. కమిషన్ పబ్లిక్ విచారణ, తడబడ్డ అధికారులు

Road Accident in Philippines: ఫిలిప్పీన్స్‌లో రోడ్డు ప్రమాదం.. తెలుగు వైద్య విద్యార్థి దుర్మరణం

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Ex-Gratia to Gulf Victims: గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. నేటి నుంచే ప్రవాసి ప్రజావాణికి శ్రీకారం

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక పరిణామం.. వారికి రెడ్‌ కార్నర్‌ నోటీసులు!

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Big Stories

×