KTR : తెలంగాణ రెవెన్యూ, ఐ అండ్ పీఆర్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. దీపావళికి బాంబులు పేలతాయని ఆయన అంటున్నారని, బాంబులు అంటే ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు.
పొంగులేటి మీద ఈడీ రైడ్స్ జరిగాయని, వాటి గురించి ఏమన్నా చెబుతారా అని అన్నారు. మామీద కేసులు పెట్టి ఏం చేసుకుంటారో చేసుకోండని సవాల్ విసిరారు. తాము బెదిరిస్తే భయపడమన్నారు.
వాటికే మేం భయపడలేదు…
ఒరిజినల్ బాంబులకే మేము భయపడలేదు, గీ సుతిల్ బాంబులకు భయపడం అని స్పష్టం చేశారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తామని, అప్పుడు ఒక్కొక్కరి సంగతి చెబుతామంటున్నారు. ఇక జగిత్యాల ఎమ్మెల్యేపైనా కేటీఆర్ తీవ్రంగా విమర్శలు చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ రాజకీయ వ్యభిచారి అని అన్నారు.
Also Read : ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి.. కేసీ వేణుగోపాల్తో భేటీ, కుల గణన సర్వేపై