Yadadri Bhuvanagiri: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో 350 లీటర్ల కల్తీ పాలు తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు.. భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామనికి చెందిన వలిగొండ పాండు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 150 లీటర్ల కల్తీ పాలు, రెండు లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 8 డోలోఫర్ స్కీమ్డ్ మిల్క్ ప్యాకెట్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు .
గౌస్ కొండా గ్రామంలో పాల వ్యాపారం చేస్తున్న అస్ఘర్ అనే వ్యక్తి కూడా పాలను కల్తీ చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. అతడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అస్ఘర్ వద్ద నుండి 200 లీటర్ల కల్తీ పాలు, 100 ఎంఎల్ హైడ్రోజన్ పెరాక్సైడ్, 3 డోలోఫర్ స్కీమ్డ్ మిల్క్ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భారీమొత్తంలో కల్తీపాలను గుర్తించడంతో.. సమీప గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. రోజూ తాము ఉపయోగించే పాలు కల్తీ అవుతున్నాయని తెలిసి ఆందోళన చెందుతున్నారు.