Hyderabad latest news telugu(Telangana today news): హైదరాబాద్లో మళ్లీ ధన్ ధన్ అంటూ తుపాకీ పేలింది. మనోజ్ తన గన్తో సిద్ధార్థ్ దాస్ పై ఫైరింగ్ చేశాడు. కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్న సిద్ధార్థ్.. శామీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసలేం జరిగిందంటే….
శామీర్పేట్లోని సెలబ్రిటీ రిసార్ట్లో జరిగిందీ గన్ ఫైర్. సిద్ధార్థ్ దాస్ విశాఖలో ఓ ప్రముఖ కంపెనీలో మేనేజర్గా పని చేస్తున్నారు. అతనికి భార్య స్మితతో విభేదాలు ఉన్నాయి. 2019లో వారిద్దరూ విడిపోయారు. అప్పటికే వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ గ్యాప్లో సిద్దార్థ్ భార్య స్మిత.. మనోజ్కు దగ్గరైంది. వారిద్దరూ కలిసి సెలబ్రిటీ రిసార్ట్స్లో మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఇద్దరు పిల్లలు కూడా వీళ్ల దగ్గరే ఉంటున్నారు.
అయితే, పిల్లలను మనోజ్ కొడుతున్నాడని తెలిసి.. అసలేం జరుగుతోందో చూద్దామని రిసార్ట్కు వచ్చాడు సిద్ధార్థ్ దాస్. ఆ సందర్భంలో మనోజ్కు, సిద్ధార్థ్ దాస్కు తీవ్ర వాగ్వాదం జరిగింది. రెచ్చిపోయిన మనోజ్.. తన దగ్గర ఉన్న ఎయిర్ గన్తో సిద్దార్థ్పై కాల్పులు జరిపాడు. అయితే, ఫైరింగ్ నుంచి సిద్దార్థ్ తప్పించుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.