EPAPER

Accident in Hyderabad: ప్రాణం తీసిన మితిమీరిన వేగం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Accident in Hyderabad: ప్రాణం తీసిన మితిమీరిన వేగం..  రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Accident in Hyderabad Students Died: హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో టిప్పర్‌ను కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామేన 4.30 గంటల సమయంలో జంక్షన్ వద్ద చోటుచేసుకుంది.


సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కారులో ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. ఈ ప్రమాదం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో జరిగిందన్నారు. ఈ ప్రమాదానికి కారు మితిమీరిన వేగంతో నడపడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు.

వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో గాయపడిన వాళ్లంతా ఇంజనీర్స్ అన్నారు. సిరి, గౌతమ్, సుదీప్ లకు గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: రాఖీ పండుగ వేళ టీఎస్ఆర్టీసీ శుభవార్త

ఇదిలా ఉండగా, పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని గంగానగర్ రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. వీరు మంచిర్యాల నుంచి గోదావరిఖనికి వెళ్తుండగా..లారీ ఢీకొట్టింది. ఇద్దరూ మంచిర్యాలలో ఓ షాపింగ్ లో పనిచేస్తున్నట్లు సమాచారం.

Related News

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Big Stories

×