Accident in Hyderabad Students Died: హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో టిప్పర్ను కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామేన 4.30 గంటల సమయంలో జంక్షన్ వద్ద చోటుచేసుకుంది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కారులో ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. ఈ ప్రమాదం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో జరిగిందన్నారు. ఈ ప్రమాదానికి కారు మితిమీరిన వేగంతో నడపడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు.
వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో గాయపడిన వాళ్లంతా ఇంజనీర్స్ అన్నారు. సిరి, గౌతమ్, సుదీప్ లకు గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: రాఖీ పండుగ వేళ టీఎస్ఆర్టీసీ శుభవార్త
ఇదిలా ఉండగా, పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని గంగానగర్ రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. వీరు మంచిర్యాల నుంచి గోదావరిఖనికి వెళ్తుండగా..లారీ ఢీకొట్టింది. ఇద్దరూ మంచిర్యాలలో ఓ షాపింగ్ లో పనిచేస్తున్నట్లు సమాచారం.