Vemulawada Temple : పవిత్రంగా భావించే దేవుడి సన్నిధిలో అక్రమార్కులెక్కువయ్యారు. తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రాలుగా భావించే వేములవాడ, కొండగట్టు, భద్రాచలం, బాసర, యాదగిరిగుట్ట, కొమురవెల్లిలో ఆలయ సిబ్బందిపై ఆరోపణలు తారా స్థాయికి చేరుకున్నాయి. దీంతో ఏసీబీ అధికారులు నిఘా పెంచారు. ముఖ్యంగా వేములవాడ రాజన్న ఆలయంలో 30 మంది ఉద్యోగులపై ఆరోపణలు తారస్థాయికి చేరగా.. వారిపై అధికారులు నజర్ పెట్టారు. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఉద్యోగుల్లో భయం నెలకొంది.
ఇప్పటికే కొందరు ఉద్యోగులు లాంగ్ లీవ్లో వెళ్లిపోయారు. AEO నుంచి జూనియర్ అసిస్టెంట్ వరకు వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఉన్న 6A కేటగిరీ దేవాలయాల్లో పనిచేస్తున్న 14 మంది ఏఈవోల బదిలీలకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. వేములవాడ, కొండగట్టు, భద్రాచలం, బాసర, యాదగిరిగుట్ట, కొమురవెల్లి అధికారులకు స్థానచలనం తప్పేట్టు లేదు.