Sheep Distribution Scam : తెలంగాణలో గత ప్రభుత్వ స్కీమ్లలో స్కామ్లు తవ్విన కొద్దీ బయటపడుతున్నాయి. గొర్రెల పంపిణీ స్కీమ్లో నిధులు దారి మళ్లిన విషయంపై ఏసీబీ అధికారులు ఫోకస్ చేశారు. ఈ కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిధులు పక్కదారి మళ్లించిన అధికారులను, కాంట్రాక్టర్లను ఇప్పటికే విచారించిన అధికారులు.. తాజాగా అమ్మిన, కొనుగోలు చేసిన రైతులను పిలిపించి.. వారి నుంచి వివరాలు సేకరించారు. బంజారాహిల్స్ ACB ప్రధాన కార్యాలయంలో ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. గొర్రెలు అమ్మిన రైతులకు కాకుండా వేరే అకౌంట్ లోకి డబ్బులు వెళ్లినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. కాంట్రాక్టర్ మోయినుద్దీన్ తన బినామీ అకౌంట్లోకి డబ్బులు మళ్లించినట్టు తమ వద్ద వివరాలు ఉన్నాయని తెలిపారు.
పశు సంవర్ధక శాఖలో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్లు ఇద్దరినీ విచారణకు పిలువనున్నారు. గత ప్రభుత్వంలో పెద్దల అండదండలు ఉండడంతోనే పెద్ద ఎత్తున స్కాంకు కాంట్రాక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు పాల్పడినట్లు సమాచారం. సమగ్ర దర్యాప్తు చేసి దారి మళ్లించిన నగదును రికవరీ చేసే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు.
ఇదీ చదవండీ : గొర్రెల పంపిణీ స్కీమ్ నిధులు గోల్మాల్.. రంగంలోకి ఏసీబీ..