Hyderabad News today(Local news telangana):
ఎల్బీనగర్ లో దొంగకు స్థానికులు దేహశుద్ధి చేశారు. గంజాయి మత్తులో ఉన్న దొంగని చితకబాదారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీ నగర్ లో హోల్ సెల్ మార్కెట్ లోని ఓ కూల్ డ్రింక్ షాప్ లో కౌంటర్ నుంచి సుమారు 10 వేల నగదును ఓ దొంగ ఎత్తుకేళ్లాడు.
మరోసారి అదే ప్రాంతానికి చోరీ చేయటానికి వచ్చాడు. స్థానికులు గత చోరికి చెందిన సీసీ వీడియో ఆధారంగా దొంగను గుర్తించారు. అనంతరం దొంగని పట్టుకొని చితకబాదారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దొంగని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు దొంగని పరిశీలించగా అతని జేబులో గంజాయి ప్యాకెట్ లభించింది. పోలీసులు దానిని స్వాదీనం చేసుకుని స్టేషన్ కి తీసుకుని వెళ్లారు. దొంగపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.