Hyderabad: అతని వయస్సు 19. డిగ్రీ చదువుతున్నాడు. ఓ ఆంటీతో అతడికి పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొద్దిరోజులు సీక్రెట్గా ఈ వ్యవహారాన్ని కొనసాగించారు. ఉన్నట్టుండి అతడు ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది.
మంగోల్కు చెందిన లగిశెట్టి అభిషేక్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. పాకెట్ మనీ కోసం సుచిత్ర ప్రాంతంలోని ఓ శాపింగ్మాల్లో పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నాడు. దగ్గర్లోనే స్నేహితులతో కలిసి రూమ్లో ఉంటూ ఉదయం.. కాలేజీ సాంయత్రం జాబ్ చేస్తున్నాడు.
అలా కొద్దిరోజులకు షాపింగ్ కాంప్లెక్స్లో అభిషేక్కు ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. అలా ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటూ, చాటింగ్ చేసుకుంటూ దగ్గరయ్యారు. వారిద్దరి మధ్య పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారాన్ని కొద్దిరోజులు కొనసాగించారు. ఆ తర్వాత వివాహిత అభిషేక్కును దూరం పెట్టడం మొదలు పెట్టింది. అభిషేక్ను క్రమంగా దూరం చేసుకుంటూ మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది.
వివాహిత మరో వ్యక్తితో చనువుగా ఉండటాన్ని అభిషేక్ గమనించాడు. ఆమెను నిలదీశాడు. ఈక్రమంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అదేరోజు సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి అతడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. అండగా ఉండాల్సిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. సదరు మహిళపై పోలీసులకుఫిర్యాదు చేశారు.