EPAPER
Kirrak Couples Episode 1

Passenger: చెప్పు పోయిందని పోలీసులకు ఫిర్యాదు.. చివరికి ఏమైందంటే?

Passenger: చెప్పు పోయిందని పోలీసులకు ఫిర్యాదు.. చివరికి ఏమైందంటే?

Passenger: ఇటీవల ఓ మూడో తరగతి బాలుడు టీచర్ తనని కారణం లేకుండా కొట్టిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇటువంటి వింత ఘటనలు పోలీసులకు అప్పుడప్పుడు ఎదురవుతుంటాయి. అయితే వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే పోలీసులకు మాత్రం ఊహించిన అనుభవం ఎదురైంది. అసలు విషయం తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఇంతకీ ఏం జరిగిందంటే..


స్టేషన్ ఘనపూర్‌కు చెందిన ఓ యువకుడు హైదరాబాద్ వెళ్లేందుకు రైల్వే స్టేషన్ వెళ్లాడు. అప్పటికే కాకతీయ ప్యాసింజర్ రైలు కదలడంతో పరుగెత్తుకుంటూ వెళ్లి రైలు ఎక్కాడు. హడావుడిగా రైలు ఎక్కడంతో అతని కాలుకున్న చెప్పు ఒకటి జారి ట్రాక్‌పై పడిపోయింది. ట్రైన్‌ ఆల్రడీ కదలడంతో దిగి తీసుకోలేని పరిస్థితి. ఇక చేసేది ఏమీ లేక అలానే హైదరాబాద్ వెళ్లాడు ఆ యువకుడు.

రూమ్‌కి వెళ్లాక అతడికి ఓ ఆలోచన వచ్చింది. వెంటనే ట్విట్టర్ వేదికగా రైల్వే పోలీసులకు కంప్లైంట్ చేశాడు. ట్రైన్ ఎక్కుతుండగా తన చెప్పు జారిపడిపోయిందని.. ఎలాగైనా దాన్ని వెతికి పెట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో కాజీపేట రైల్వే పోలీసులు శనివారం స్టేషన్ ఘన్‌పూర్ స్టేషన్ వద్ద గాలించి ఎట్టకేలకు చెప్పును కనుగొన్నారు. ఆ యువకుడిని పోలీస్ స్టేషన్‌కు పిలుపించుకొని చెప్పును అప్పగించారు.


Tags

Related News

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

Big Stories

×