Marriage: పెళ్లి చేసుకోవడం.. కొన్ని రోజులు కాపురం చేశాక మనస్పర్థాలు రావడంతో విడిపోవడం.. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకోవడం. ఈ మధ్యకాలంలో ఇటువంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఓ వ్యక్తి మాత్రం ఇద్దరు అమ్మాయిలను ఒకే సారి పెళ్లి చేసుకున్నాడు. ఒకే మండపంపై ఒకే ముహూర్తానికి ఇద్దరి మెడలో తాళి కట్టాడు.
భద్రాద్రి జిల్లా ఎర్రబోరు గ్రామంలో జరిగింది ఈ ఘటన. సత్తిబాబు అనే వ్యక్తి స్వప్న, సునీతలతో ఒకరికి తెలియకుండా ఒకరితో మూడేళ్లుగా సహజీవనం చేశాడు. ఇప్పటికే సునీతకు ఓ బాబు ఉండగా.. ఇటీవల స్వప్నకు ఓపాప జన్మించింది. దీంతో ఈ విషయం బయటపడింది. ఈక్రమంలో ఇద్దరూ తమను పెళ్లి చేసుకోవాలని సత్తిబాబును వేధించారు.
దీంతో చేసేది ఏమీ లేక ఇద్దరినీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు సత్తిబాబు. ఈ విషయాన్ని పెద్దలకు కూడా చెప్పడంతో వారు అందుకు అంగీకరించారు. ఇటీవల వారి పెళ్లిని వైభవంగా జరిపించారు. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.