NGT: తెలంగాణ సర్కారుకు బిగ్ షాక్ ఇచ్చింది నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్-NGT. ఏకంగా 920 కోట్ల భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండానే పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులు చేపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 1.5 శాతం జరిమానాగా విధిస్తూ చెన్నైలోని ఎన్జీటీ ధర్మాసనం తీర్పు ఇవ్వడం కలకలం రేపుతోంది.
ఆ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా.. వెంకటయ్య అనే వ్యక్తి చెన్నై ఎన్జీటీలో కేసు వేయగా.. ఏపీ ప్రభుత్వం అనుబంధ పిటిషన్ వేసింది. అనుమతుల్లేని ప్రాజెక్టులను నిలిపివేయాలని గతంలోనే ఎన్జీటీ ఆదేశించింది. అయినా నిర్మాణాలు కొనసాగుతుండటంతో ఏకంగా 920 కోట్ల ఫైన్ వేసింది. అనుమతులు లేకుండా నిర్మించిన పట్టిసీమ, పురుషోత్తమపట్నం విషయంలో అనుసరించిన విధానాన్నే తెలంగాణలోనూ అమలు చేస్తున్నట్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల పర్యవేక్షణకు కేంద్ర అధికారులతో కమిటీ వేయాలని ఆదేశించింది చెన్నై ఎన్జీటీ.