Medak : ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ ఏ సంబంధం లేని ఓ యువతి ప్రాణాలు తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లికి చెందిన ఉప్పు నరేందర్ , స్వామి అనే ఇద్దరి వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో నరేందర్ , స్వామిని నెట్టివేశాడు. కిందపడిన స్వామిని అక్కడున్న స్థానికులు పక్కకు తీసుకువెళ్లారు. దీంతో కోపంతో రగిలిపోయిన నరేందర్ తన థార్ కారుతో దూసుకొచ్చాడు.
పెళ్లి కూతురిని ఊరేగింపుగా మెట్టినింటికి పంపిస్తున్న బృందంపైకి దూసుకొచ్చాడు. ఈ ఘటనలో రమ్య(23) అనే యువతి తీవ్రంగా గాయపడింది. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. రమ్యను హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.