Hyderabad : హైదరాబాద్ లో మరోసారి ఉగ్రవాదుల కదలికలు వెలుగుచూశాయి. నగరంలో తలదాచుకున్న రాడికల్ ఇస్లామిక్ కార్యకర్తలను భోపాల్ పోలీసులు అరెస్టు చేశారు. ఓ కేసులో విచారణలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులతో కలిసి హైదరాబాద్లో నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే 16 మందిని అరెస్టు చేశారు.
అరెస్టైన వారిలో 11 మంది భోపాల్ చెందినవారీగా గుర్తించారు. మరో ఐదుగురు హైదరాబాద్ వాసులుగా పోలీసులు నిర్ధారించారు. నిందితుల నుంచి జిహాదీ సాహిత్యం, కత్తులు, ఎయిర్గన్స్ స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. నగరంలో 18 నెలలుగా రాడికల్ ఇస్లామిక్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు నిర్ధారించారు.