President Medals: తెలంగాణ పోలీసులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ గుడ్ న్యూస్ ను తెలియజేసింది. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో కథనాల్లో వచ్చిన వివరాల ప్రకారం.. కేంద్రం అందించే ప్రెసిడెంట్ మెడల్ కు రాష్ట్రం నుంచి 11 మంది పోలీసులు ఎంపికైనట్లు తెలిపింది. ఇందులో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతితోపాటు జమీల్ భాషా (కమాండెంట్), క్రిష్ణమూర్తి (ఏఎస్పీ), నూతలపాటి జ్ఞనసుందరి(ఇన్ స్పెక్టర్), కొమరబత్తిని రాము(ఎస్సై), అబ్దుల్ రఫీక్(ఎస్సై), ఇక్రమ్ ఏబీ ఖాన్ (ఎస్సై), శ్రీనివాస మిశ్రా(ఎస్సై), కుంచల బాలకాశయ్య(ఎస్సై), లక్ష్మయ్య(ఏఎస్సై), గుంటి వెంకటేశ్వర్లు(ఏఎస్సై) ఉన్నట్లు తెలిసింది.
Also Read: తెలంగాణలో ఉపఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్
హైదరాబాద్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలెంట్రీ పతకానికి ఎంపికయ్యారు. మాదాపూర్ సీసీఎస్ లో పనిచేస్తున్న యాదయ్య అనే హెడ్ కానిస్టేబుల్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. దీంతో ఆయనను రాష్ట్ర డీజీపీ జితేందర్, అడిషనల్ డీజీపీ సంజయ్ కుమార్, ఐజీలు విజయ్ కుమార్, రమేష్ అభినందించి, శాలువాతో సన్మానించారు.