IAS Transfers : తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతోంది. మరో 11 మంది ఐఏఎస్లను బదిలీ చేసినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతికుమారి తెలిపారు. వారిలో అరవింద్ కుమార్ విపత్తు నిర్వహణ శాఖకు బదిలీ అయ్యారు. బీసీ వెల్ఫేర్ సెక్రటరీగా ఉన్న వెంకటేశంను బదిలీ చేసి విద్యా శాఖ సెక్రటరీగా నియమించారు. కే శ్రీనివాస్ రాజు రవాణా శాఖ ప్రధాన అధికారిగా నియమితులు అయ్యారు.
మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దాన కిషోర్, హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఎండీగా సుదర్శన్రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా శ్రీదేవి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్గా ఆర్వీ కర్ణన్, అటవీ పర్యావరణశాఖ ప్రధాన కార్యదర్శిగా వాణిప్రసాద్, మహిళా శిశు సంక్షేమ శాఖ కమీషనర్ గా వాకాటి కరుణ నియమతులు అయ్యారు.