తెలంగాణలో ఇవాళ కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఎల్బీస్టేడియం వేదికగా సీఎంగా రేవంత్రెడ్డి మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేవంత్తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.
రాజ్ భవన్కు 11 మంది జాబితాను పంపారు. వీరిలో భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహలు ఉన్నారు.